చిరువ్యాపారులకు అండగా జగనన్న ప్రభుత్వం. 


విశాఖపట్నం,నిజం న్యూస్ ;  జగనన్న ప్రభుత్వం చిరువ్యాపారులకు అండగా ఉంటుందని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు. మంగళవారం ఆర్కే బీచ్ శ్రీ షిరిడి సాయి వర్తక సంఘం సభ్యులు ఆమెను కలసి తమ సమష్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చిరువ్యాపారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు ఏ సమష్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తా మన్నారు. సంఘం ప్రతినిధులు కట్టా రాజు, దండు త్రినాధ్, వైసీపీ నాయకులు మరడ శ్రీనివాసరెడ్డి తదితరులు ఆమెను కలసి తమ సమష్యలను వివరించగా, వాటన్నింటి పరిస్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.