క్యాన్సర్ రోగికి ఎంపీ ఎంవీవీ బాసట

కాన్సర్ రోగికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  బాసట 
-రూ.3లక్షల పీ ఎం ఎన్ ఆర్ ఎఫ్ 
కేటాయింపు  
విశాఖపట్నం , ఫిబ్రవరి  25,నిజంన్యూస్
వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ ఆసుపత్రి లో కాన్సర్  తో బాధపడుతున్న ఓ వ్యక్తికి  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటగా నిలిచారు .  విశాఖ నగరానికి చెంది ప్రస్తుతం పుదుచ్చేరి లో నివాసముంటున్న కామన వెంకట నారాయణ  గత కొంత కాలంగా 
ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో   చికిత్స  చేయాలని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయార్ధం ఎంపీ ఎంవీవీ ని ఆశ్రయించారు. స్పందించిన ఎంవీవీ 
 ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద  దరఖాస్తు  చేయించారు. .  తదుపరి ఆసుపత్రి ఖర్చులకు రూ.3 లక్షల మంజూరు కేంద్రం నుంచి  లభించింది. ఆ మంజూరైన. పత్రాన్ని  ఎంవీపీ కాలనీ లో ఉన్న 
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ ఆఫీసు లో మంగళవారం   అందజేశారు. ఈ సందర్భం గా వెంకటనారాయణ    మాట్లాడుతూ ఆర్ధికంగా పరిపుష్టి లేనితమకు దన్నుగా నిలిచి , ఈ సహాయం  తమకు అందజేసేందుకు కృషిచేసిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు. ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోఉన్న ప్రతి ఒక్కరికీ తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.